హనుమకొండ చౌరస్తా, మే 23 : కాకతీయ విశ్వవిద్యాలయంలో(Kakatiya University) మెస్లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళన చేపట్టారు. ప్లేట్లతో రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పీడీఎస్యూ కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్స్, డీఎస్సీతోపాటు వివిధ రకాల పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో మెస్ను ముసివేయడం తగదన్నారు. సర్క్యూలర్ను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్ల డైరెక్టర్ సమ్మయ్య హాస్టల్స్ను ముసివేయమని, యథావిధిగా నడిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థి నాయకులు వినయ్, రాజు, శ్రవణ్, అర్జున్, గణేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.