మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : మిర్చి కాంటా ఆలస్యం అవుతోందని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు రోజులైనా మిర్చి కాంటాలు వేయడం లేదని, మార్కెట్ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపారులు మార్కెట్కు వచ్చిన మిర్చికి కొన్ని బస్తాలకు మంచి ధర నిర్ణయించి మిగతా వాటికి తక్కువ రేటును నిర్ణయించడటం సరికాదని అన్నారు. ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో మిర్చికి రూ. 21 వేల నుంచి రూ.22 వేల ధర పలికితే, మహబూబాబాద్ మార్కెట్లో మాత్రం రూ.18 వేల నుంచి రూ.19 వేలు మాత్రమే వస్తున్నదని ఆవేదన చెందారు.