ఆదిలాబాద్ : కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నీళ్లు లేక, కరెంట్ రాక, పంటలు ఎండి అరిగోస పడ్డారు. పగలు, రాత్రి కష్టపడి ఎలాగోలా పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోని రైతుల కష్టమంతా వర్షార్పణమవుతున్నది. ఇప్పుడు తాజాగా విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధిక ధరలు, నాణ్యమైన విత్తనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) సరిపడా విత్తనాలు సరఫరా చేయాలని రైతులు ఆందోళన (Farmers Concern) బాటపట్టారు. దుకాణదారులు కొన్ని రోజులుగా విత్తనాలు విక్రయిం చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాశి 659 పత్తి విత్తనాలు(Rashi 659 cotton seeds) అమ్మాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యాపారులు ఎక్కువ ధరకు విత్తనాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు.