హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. ఫిర్యాదుపై విచారణ పూర్తి చేసి ఈ నెల 26లోగా తగి ననిర్ణయం తీసుకుంటామని హామీ ఇ చ్చింది. ఈసీ వివరణతో సంతృప్తి చెంది న హైకోర్టు దాసోజు పిటిషన్పై విచారణ ను ముగించింది. కేటీఆర్కు పరువు న ష్టం కలిగేలా సురేఖ ప్రెస్మీట్లో వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేటీఆర్కు ఎలాంటి ప్రమేయం లేకపోయి నా తీవ్ర ఆరోపణ లు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుపై ఈసీ స్పందించలేదని దాసోజు హైకోర్టును ఆశ్రయించా రు.మంత్రిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఈసీ వివరణతో సంతృప్తిని వ్యక్తం చేసి విచారణను ముగించింది.