వెల్గటూర్, నవంబర్ 10: ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం మొక్కట్రావ్పేటకు చెందిన 441 మంది ఎల్లంపల్లి భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.13.25 కోట్ల విలువైన చెక్కులను అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరంద్తో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ముంపు బాధితులైన 475 మంది యువకులకు ప్యాకేజీ వర్తింపజేశామన్నారు.