హైదరాబాద్ : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై, కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు
నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచరణ రూపొందించేందుకు కమిటీ సభ్యులు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎంవో ఓఎస్డీ, దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.