నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 26: అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు.