జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో పేదలు ఎవరూ వైద్యం అందక ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుంబిగించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భూపాలపల్లిలో 30 ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డును జడ్పీ చైర్ పర్సన్ జక్కుల హర్షిణి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం కొవిడ్ బారిన పడ్డ తల్లిదండ్రులను పిల్లల సంరక్షణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న బాలల పరిరక్షణ విభాగాన్ని, కొవిడ్ బారిన పడ్డ పిల్లలను ఇంటి నుంచి పరిరక్షణ కేంద్రానికి తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వాహనాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో సీఎం కేసీఆర్ సీరియస్ గా దాని నియంత్రణ, చికిత్సపై దృష్టి సారించారని తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశారని, అదే విధంగా మందుల కొరత ఉండకుండా మెడికల్ రీజినల్ సబ్ సెంటర్ ను ఇచ్చారని పేర్కొన్నారు.
వీటివల్ల ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించి, విజయవంతం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు