మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది మండు వేసవిలోనూ నిండుగా నీటితో కనిపిస్తున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు మధ్యాహ్నం వేళల్లో బావుల్లో ఈత కొడుతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్లు కట్టుకొని కొందరు చిన్నారులు ఈత నేర్చుకుంటున్నారు. శనివారం ఓదెల మండలం కొలనూర్లో కొందరు ఇలా ఈత కొడుతుండగా ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.
-ఓదెల