హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో 10.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 11.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 11.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 12.7, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 13.1 డ్రిగీలు, మెదక్ జిల్లా టేక్మాల్లో 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.