జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి ఓపుణ్య కార్యక్రమం అని, అనేకమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 139 మంది లబ్ధిదారులకు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం లో CMRF ద్వారా 27 వేల మందికి దాదాపు 69 కోట్ల రూపాయలు, LOC ద్వారా 381 మందికి 5 కోట్ల రూపాయల చెక్కుల ను మంజూరు చేశామన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.