సూర్యాపేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 69 మంది లబ్ధిదారులకు సుమారు రూ.70 లక్షల విలువగల అందజేసి చెక్కులు అందజేసి మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వ పథకమైనా ఎక్కువ శాతం ఆయా నాయకుల అనుచరులకు మాత్రమే లభించేవన్నారు. కానీ, తెలంగాణ ఏర్పాటు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. అంతేకాకుండా గతంలో ఈ చిన్న సమస్య ఉన్నా ఫైరవీ కారుల ఇబ్బందులే ఎక్కువగా ఉండేవన్నారు.
ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా ప్రజలే నేరుగా తమ సమస్య పరిష్కారానికి విన్నవించుకునే స్వాతంత్య్రం ఉందనే మాట ప్రజల నోట వింటుంటే గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులతో పేద కుటుంబాలకు ఆర్థిక భారంతో అప్పుల బాధలు లేకుండా కొండంత అండగా నిలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Cm Kcr | శాంతమ్మకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..