CM Revanth | హైదరాబాద్ : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు రేవంత్.
ఇక ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా తాజ్ కృష్ణకు బయల్దేరారు. తాజ్ కృష్ణలో సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సచివాలయానికి రానున్నారు. సచివాలయం వద్ద రేవంత్కు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు.