హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయిందని, మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష పడటం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై సీఎం నోటికి వచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది సీఎం రేవంతేనని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి ‘పాథలాజికల్ లయ్యర్’ అంటూ దుయ్యబట్టారు. రేవంత్ రోగలక్షణమే అబద్ధాలు చెప్పడం అని, అలా ప్రతి నిత్యం అబద్ధాలు ఆడటమే పనిగా పెట్టుకునే వాడిని పాథలాజికల్ లయ్యర్ అంటారని వివరించారు. తమ నేత హరీశ్రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్రెడ్డి గుర్తు పెట్టుకోవాలని సూచించారు.