హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బుధవారం కేరళ రాష్ర్టానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార జాతీయ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన రేవంత్రెడ్డికి ఏడు రాష్ర్టాల పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి. దీనిలో భాగంగా కేరళలో రెండు రోజులపాటు ఉండనున్న రేవంత్రెడ్డి ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తరఫున వయనాడ్లో బుధవారం జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తరఫున అలప్పుజి (అలెప్పి) నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారసభలోనూ పాల్గొననున్నారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారసభల్లో రేవంత్రెడ్డి పాల్గొంటారు.పీసీసీ ఆయన ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 50 బహిరంగసభలు, 15 రోడ్ షోలలో ఆయన పాల్గొనున్నారు.