హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )బుధవారం ఢిల్లీ(Delhi) బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు నేడు అభ్యర్థులను(Lok Sabha Candidates) ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తుది జాబితాపై అధిష్ఠానంతో చర్చలు జరగనున్నాయి. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు వెళ్లారు.