Revanth Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించాలని ప్రజలకు చెప్పకనే చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ మాటల్లోనే.. హైదరాబాద్లో ఉన్నాడా..? తాండూరులో ఉన్నాడా..? అని చెప్పి ప్రతి ఓటు లెక్కకట్టి చూసుకోవాలి. వాళ్లకు సమాచారం పంపాలి. ఎందుకంటే ఇత రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మనకు మే 13న ఎన్నికలు ఉంటే.. మహారాష్ట్రన ఇంకో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ 6న ఎన్నికలు ఉన్నాయి. మన చుట్టాలు కానీ, మనోడు కానీ కర్ణాటకలో ఉంటే అక్కడ ఎన్నికలు చూసుకోని, మళ్లా ఇక్కడ ఎన్నికలకు రావొచ్చు. మీరు అన్ని రకాలుగా ఓట్లను చేజారనివ్వకుండా కాపాడుకోవాలని ప్రజలకు రేవంత్ సూచించారు.
పక్క రాష్ట్రాల్లో ఓటు వేసిన వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించండి – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/LjhmwVzZkG
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024