హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ 117వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకొన్నారు.
అత్యంత పేదరికంలో జన్మించిన బాబూ జగ్జీవన్రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. జాతీయోద్యమంలో పాల్గొన్న జగ్జీవన్రామ్ రాజ్యాంగపరిషత్తు సభ్యుడిగానూ సేవలందించారని గుర్తు చేశారు. స్వాతంత్య్రానంతరం అనేక మంత్రి పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు జగ్జీవన్రామ్ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు.