హైదరాబాద్ : ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ముఖ్య అతిథిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ బుధవారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రంజాన్ తొలి శుక్రవారం 15 న సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృత ఏరాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రంజాన్ మొదటి శుక్రవారం సందర్భంగా ఎల్.బి స్టేడియం లో ముస్లిం సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.