హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అన్ని శాఖలు పన్ను వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక (2023-24) సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖల పన్ను వసూళ్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖలో లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎకువగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. సుంకం చెల్లించని మద్యాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా అడ్డుకోవాలని ఆదేశించారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్ అమర్చి ట్రాకింగ్ చేయాలని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉండాలని అన్నారు. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు చెప్పగా.. ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదని సీఎం అన్నారు. అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. కంకరను రహదారులపై కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారని, అలా కాకుండా నగరంలో వివిధ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాలను అందుకు వినియోగించాలని సూచించారు. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన గనులపై గతంలో విధించిన జరిమానాలు వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. టీఎస్ఎండీసీతోపాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏండ్లుగా తిష్టవేశారని, కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.