హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదని, తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబ్ ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్లో గురువారం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్లో పాల్గొని మాట్లాడారు.
ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, అందరినీ కలుపుకుపోతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై ఉకుపాదం మోపాలని, హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు. పోలీసుల సమస్యలు తెలుసుకొని పరిషరించడానికి సిద్ధంగా ఉంటామన్నారు.