Praja Palana |హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నది. గురువారం (28వ తేదీ) నుంచి జనవరి 6వ తేదీ వరకు (31, 1వ తేదీ మినహా) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లతోపాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అదే విధంగా రైతుబంధు, ఆసరా పథకంలో ఇప్పటికే లబ్ధిపొందుతున్న రైతులు, వృద్ధులు తదితరులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైతే లబ్ధిపొందడం లేదో వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్యారెంటీల దరఖాస్తు ఫారాన్ని బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. అనంతరం దరఖాస్తు ఫారాలను జిల్లాలకు చేరవేశారు. చాలా వరకు ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ నేతలు దరఖాస్తు ఫారాలను జిరాక్స్ తీయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు పంచుతు న్నారు. వాట్సాప్లో దరఖాస్తు ఫారం సర్యులే ట్ కావడంతో ఎవరికి వారు జిరాక్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి? ఎవరెవరు చేయాలనేదానిపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అంగన్వాడీలు, ఇతర ఉద్యోగుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఏ గ్రామంలో ఎప్పుడు దరఖాస్తు తీసుకుంటారనే సమాచారా న్ని ఇప్పటికే ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అధికారులు సమాచారం ఇచ్చారు.
ప్రతి 100 దరఖాస్తులకు ఒక కౌంటర్: సీఎస్ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు అన్ని గ్రామాల్లో విసృ్తతంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. బుధవారం రాత్రి ఆమె కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పా లన కార్యక్రమ పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. గ్రామసభలు ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని సూచించారు. మహిళలకు పురుషులకు వేరు వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 దరఖాస్తు దారులకు ఒక కౌంటర్ చొప్పున పెట్టాలని ఆదేశించారు.