హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 202425 సంవత్సరానికి మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు, నేతన్నలకు సహాయం అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు బీసీ వెల్ఫేర్శాఖ ద్వారా కేటాయించిన రూ.400 కోట్ల బడ్జెట్ను వినియోగించేందుకు సీఎం అంగీకరించినట్టు వెల్లడించారు. టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ల తయారీ పరిశ్రమను పోచంపల్లిలో నెలకొల్పేందుకు సీఎం ఆమోదం తెలిపారని తెలిపారు. బాలికలు రుతుక్రమ సమయంలో బడికి హాజరుకాకపోవడాన్ని తగ్గించేందుకు సానిటరీ నాప్కిన్లు స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉంచి టెస్కోకు రావాల్సిన బకాయిల విడుదలకు సీఎం అంగీకరించారని మంత్రి తుమ్మల తెలిపారు.