యాదాద్రి : రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహన్ బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. సీపీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ప్రశంసించారు.
భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ తరుఫున చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు దేవాదాయ అధికారులు, పోలీసు అధికారులతో భక్తులకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. యాదాద్రి ప్రాంతంలో శాంతిభద్రతలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాచకొండ కమిషనర్ పరిధిలోని ప్రజలకు సేవలందించేందుకు ఆ లక్ష్మినరసింహ స్వామి తనకు బాధితులు అప్పగించారని, స్వామి కృప వల్ల శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు.