మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి మందగిస్తుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ నిర్ణయాలు తీసుకొన్నది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో శాంతి, సామరస్యాన్ని కొనసాగించేందుకు కేసీఆర్ కంకణబద్ధుడై పనిచేస్తున్నారు. మైనారిటీల సంక్షేమమే కాకుండా ప్రజలందరి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డల పెండ్లిళ్లకు సాయం అందిస్తున్నారు. టీ ప్రైడ్లో భాగంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు వాహనాలు అందజేసి స్వయం ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం అందించాలి. మళ్లొక్కసారి కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలి.
– సర్దార్ నరేందర్సింగ్, అమీర్పేట గురుద్వారా స్టేట్ సెక్రటరీ