హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ నివారణ విధివిధానాలపై కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. సమావేశంలో హోంమంత్రి మహముద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీలు, ఎస్పీలు, సీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
డ్రగ్స్ కేసుల్లో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలి అని కేసీఆర్ స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. ఈ సెల్ ప్రత్యేక విధులు నిర్వర్తించాలి. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలి అని కేసీఆర్ ఆదేశించారు.