హైదరాబాద్ : తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్తో సమావేశం కానున్నారు. స్టాలిన్ సీఎం అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించనున్నట్టు సమాచారం.
నిన్న మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లిన సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. శ్రీరంగం రావడం ఇది రెండోసారి అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.