Minister Harish Rao | నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి/సూర్యాపేట, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ దిరిగేలా అద్భుతంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలుచేసి చూపించారని, ఇప్పుడు మళ్లీ మహిళలు, యువత కోసం మ్యానిఫెస్టో సిద్ధంచేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్లో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పలు అభివృద్ధి పనులకు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి హరీశ్రావు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా చోట్ల ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వదిలించుకున్న నాయకులు చేర్చుకుని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పెద్దలు రేపు రాష్ర్టాన్ని అమ్ముతారని విమర్శించారు. తెలంగాణకు వారంటీ అయినా, గ్యారెంటీ అయినా కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్ పార్టీ వదిలించుకున్న నాయకులను చేర్చుకుని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. రూ.10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పెద్దలు.. రేపు రాష్ర్టాన్ని అమ్ముతారు. తెలంగాణకు వారంటీ అయినా, గ్యారెంటీ అయినా కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.
– మంత్రి హరీశ్రావు
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు ఇచ్చి సీఎం కేసీఆర్ నీటి కష్టాలు తీర్చారని మంత్రి హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. దేశంలోనే అధికంగా రూ.2000 పింఛన్ను, అత్యధిక పింఛన్లు ఇస్తున్నది కేసీఆర్ సర్కార్ అని తెలిపారు. పింఛన్ల వల్ల అత్తా కోడళ్ల పంచాయితీలు బంద్ అయ్యాయని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గౌర వం పెరిగిందని అన్నారు. ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 12.74 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చామని తెలిపారు. నల్లగొండ, సూర్యాపేటలకు మెడికల్ కాలేజీలు తెచ్చామని తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ.17 కోట్లతో రామన్నపేటలో దవాఖానను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నకిరేకల్లో 30-40 మంది డాక్టర్లలో 100 పడకల దవాఖాన సిద్ధం అవుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కనీసం హైదరాబాద్లో ఇల్లు కూడా లేదని పేర్కొన్నారు. కండ్లు మూసినా తెరిచినా నకిరేకల్ ప్రజల సేవ గురించే ఆయన ఆలోచిస్తారని తెలిపారు. నకిరేకల్లో జరుగుతున్న వందల కోట్ల అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
దేశంలోనే అధికంగా రూ.2000 పింఛన్ను, అత్యధిక పింఛన్లు ఇస్తున్నది కేసీఆర్ సర్కార్. పింఛన్ల వల్ల అత్తా కోడళ్ల పంచాయితీలు బంద్ అయ్యాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గౌరవం పెరిగింది. ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 12.74 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చింది.
కంటి ముందు అభ్యర్థిని, మీ ఇంటి ముం దు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్రావు కోరారు. నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, అభివృద్ధి జరుగని గ్రామం లేదని తెలిపారు. గతంలో ఇక్కడ కూలీ దొరకని పరిస్థితి నుంచి నేడు కూలీలు దొరకని పరిస్థితి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ నుంచి నాట్లు వేసే మగ కూలీలు, గుంటూరు నుంచి పత్తి తీసే వ్యవసాయ కూలీలు తెలంగాణలో ఉపాధి కోసం వస్తున్నారని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్లు ఎందుకు చేయలేదో, నేడు కేసీఆర్ ఎలా చేశారో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం, పైరవీల కోస మే ఆలోచించి కడుపు నింపుకోవడమే లక్ష్యం గా పని చేశారని విమర్శించారు. ‘కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా ఇచ్చారు. కరెంట్ ఇచ్చా రు. నీళ్లు ఇచ్చారు. పండిన పంటను కొనుగోలు చేశారు. ఫలితంగా దేశంలో తెలంగాణ అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా అవతరించింది’ అని తెలిపారు. రాష్ట్రంలోనూ అత్యధిక ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం కొట్లాటలు, పండిన పంట కొనేందుకు ఆందోళనలను ఇంకా ప్రజలు మర్చిపోలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
గతంలో ఇక్కడ కూలీ దొరకని పరిస్థితి నుంచి నేడు కూలీలు దొరకని పరిస్థితి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి నాట్లు వేసే మగ కూలీలు, గుంటూరు నుంచి పత్తి తీసే వ్యవసాయ కూలీలు తెలంగాణలో ఉపాధి కోసం వస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్లు ఎందుకు చేయలేదో, నేడు కేసీఆర్ ఎలా చేశారో ప్రజలే ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం, పైరవీల కోసమే ఆలోచించి కడుపు నింపుకోవడమే లక్ష్యంగా పని చేశారు. ‘కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా ఇచ్చారు. కరెంట్ ఇచ్చారు. నీళ్లు ఇచ్చారు. పండిన పంటను కొనుగోలు చేశారు. ఫలితంగా దేశంలో తెలంగాణ అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా అవతరించింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి పేరుకు పెద్ద కాంగ్రెస్ నాయకులని, వాళ్ల పనులు మాత్రం చిన్నవని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల నల్లగొండ నీళ్ల కుండ అయిందని, హేమాహేమీలుగా చెప్పకొనేవారిని ఓడించి 12కు 12 స్థానాలకు గెలిచి కేసీఆర్ను దీవించారని చెప్పారు. తుంగతుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్ల పారుతున్నాయని, తొమ్మిదేండ్లలో ఏనాడూ కరువును చూడలేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నారని తెలిపారు. పడావు పడ్డ భూములు పచ్చని పొలాలుగా మారాయని చెప్పారు. దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. నకిరేకల్లో నిమ్మకాయల మారెట్ అడిగితే తాము పెట్టామని, పదేండ్లు కాంగ్రెస్ మంత్రులు ఉన్నా బత్తాయి మారెట్ తేలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో యాసంగిలో ఏనాడైనా మోటార్ కాలకుండా పంటలు పండాయా? అనేది రైతులు గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని సూచించారు. ఇప్పటికే మహిళలు, వృద్ధులు, రైతులు, దళితులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఆనాడు నేను రాను బిడ్డో సరారు దవాఖానకు అన్న స్థితి నుంచి నేడు పోదాం పద బిడ్డ సరారు దవాఖానకు అనే రీతిలో దవాఖానలను అభివృద్ధి చేశామని చెప్పారు. తుంగతుర్తిలో 35 కోట్లతో 100 పడకల దవాఖాన ఆరు నెలల్లో నిర్మిస్తామని చెప్పారు. మోత్కూర్లో 30 పడకల దవాఖాన తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో గాదరి కిశోర్ రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్కు ఎదురొడ్డి పోరాడిన నాయకుడని, ఉద్యమంలో భుజం భుజం కలిపి పనిచేశామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దగ్గరకు స్వయంగా వెళ్లి పనిచేయించుకొని వచ్చే కిశోర్ మీ ఎమ్మెల్యేగా ఉండటం మీ అదృష్టమని పేర్కొన్నారు. అభివృద్ధిలో సూర్యాపేట, సిద్దిపేటతో పోటీ పడుతున్న తుంగతుర్తిలో మరింత అభివృద్ధి కొనసాగాలంటే కిశోర్ను మరోసారి దీవించాలని కోరారు.
తెలంగాణ ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పడానికి వంద అంశాలు ఉన్నాయని, కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర ప్రజలకు వంద విధాలుగా ద్రోహం చేసిందని మండిపడ్డారు. గ్రామాల్లో పచ్చదనం, రహదారులు, మనుషులకు గౌరవం, ప్రజల మధ్య ప్రేమ పెరిగిందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీనేనని చెప్పారు. 60 ఏండ్ల పాలనలో మూసీ మురికి నీరు, ఫ్లోరోసిస్తో లక్షలాది మందిని పొట్ట పెట్టుకున్న దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. అభివృద్ధిని పట్టించుకోకుండా, గ్రామాల్లో ప్రజల మధ్య కొట్లాటలతో పబ్బం గడిపిన దుర్మార్గులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలని విమర్శించారు. మాయమాటలతో ఎన్నికల వేళ ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబంగా, ఎమ్మెల్యేలంతా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పోటీ పడి పనిచేస్తున్నారని, అలాంటి వారందరినీ మరోసారి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, కార్పొరేషన్ల చైర్మన్లు కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు కాసోజు శంకరమ్మ, గాయకుడు ఏపూరి సోమన్న, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఉంటే.. బీజేపీ పాలిత గుజరాత్లో పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కరెంట్ వస్తలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారని, ఒకసారి విద్యుత్తు వైర్ పట్టుకుంటే కరెంట్ వస్తుందో, లేదో తెలుస్తుందని చురక అంటించారు. ‘కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా..? మా పాలనలో కరెంట్ బాగుందా..? ప్రజలనే తీర్పు కోరదాం. దాని మీదే ఎన్నికలకు పోదాం’ అని సవాల్ విసిరారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా, 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా అని అనడంతో జనం 24 గంటల కేసీఆరే కావాలంటూ నినదించారు. కాంగ్రెస్వి ఓట్ల కోసం ఆపద మొక్కులని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో ఆరు గ్యారెంటీ పథకాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎలాగూ గెలిచేది లేదన్న దికుతోచని స్థితిలో తప్పుడు హామీలు ఇస్తున్నదని మండిపడ్డారు. అక్కడ చేతకాదు గానీ ఇక్కడ ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. కర్ణాటకలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేక అక్కడి ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీ ఏదీ చేయలేక చతికిల పడుతున్నదని ఎద్దేవా చేశారు. అదే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను బియ్యం అడుగుతున్నదని, ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనమని పేర్కొన్నారు.