నల్లగొండ : వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఏఎమ్మార్ కాలువపై నల్లగొండ మండలం గుండ్లపల్లి వద్ద గల D37 ద్వారా సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని సాగు కోసం మనకు దక్కాల్సిన వాటా ప్రకారం ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకుంటున్నామనితెలిపారు.
వేసవికాలంలో కూడా మన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని, ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి , సీనియర్ నాయకులు బకరం వెంకన్న, గాదె రామ్ రెడ్డి , ఉపాధ్యక్షుడు బడుపులు శంకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తవిటి కృష్ణ, ఎంపీటీసీలు ఇరిగి సహదేవ, రాజుపేట మల్లేశం, సర్పంచ్లు పంతంగి సరిత, మన్నెం కృష్ణార్జున్ రెడ్డి, పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.