హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిరుద్యోగులు కలకాలం గుర్తించుకునే ప్రత్యేక రోజు అని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నియామకాల కోసం ఎదురు చూస్తున్న ఉన్న నిరుద్యోగ యువత నిరాశను, నిస్పృహను నివారిస్తూ.. సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా ఉద్యోగ ప్రకటన చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కూడా పూర్తవుతుండటంతో సంపూర్ణ తెలంగాణ సాకారమైనట్లయిందన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు మంత్రి సత్యవతి రాథోడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.