నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్ నిర్మాణపనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్ పనుల పురోగతిని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలిస్తున్నారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలిస్తున్నారు.
కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా మొదటి యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక టీఎస్ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సీఎం సమావేశమై అక్కడ జరుగుతున్న పనులపై సలహాలు, సూచనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.