యాదాద్రి భువనగిరి : యాదాద్రి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.