హైదరాబాద్ : తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే కొత్త సచివాలయం నిర్మాణం అని సీఎం కేసీఆర్ అన్నారు. తుది దశలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం పరిశీలించారు. సచివాలయం ప్రధాన ద్వారం నుంచి మొదలుకొని చివరి అంతస్తు వరకు అన్ని పనులను పరిశీలించి, తగు సూచనలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సచివాలయం నిర్మాణం చేపడుతున్నామని సీఎం తెలిపారు. అంబేద్కర్ పేరును సార్థకం చేసేలా, ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా సచివాలయం నిర్మాణం ఉందన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ సచివాలయం ఇనుమడింపజేస్తుందన్నారు. గత వందేండ్లలో ఇంత భారీగా ధోల్పూర్ స్టోన్ను వాడిన కట్టడం లేదని గుర్తు చేశారు. మరే రాష్ట్రంలోనూ ఇంతటి స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదన్నారు. సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్థూపం నిర్మాణం చేపట్టామని తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాలు నిత్యం స్మరించుకునేలా కనిపిస్తోందన్నారు. సచివాలయం పక్కనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఎప్పటికప్పుడు కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంజినీర్లు, అధికారులు ఉన్నారు.
నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సీఎం గారి వెంట మంత్రులు @trsharish, @VPRTRS, @VSrinivasGoud, @jagadishTRS, @IKReddyAllola, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు pic.twitter.com/OcQnGRxrB0
— Namasthe Telangana (@ntdailyonline) November 17, 2022