సిద్దిపేట : కొమురవెల్లి మల్లన్న స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలతో మల్లన్న స్వామికి అభిషేకం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మల్లన్న పాదాలను కడుగుతానని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Live: CM Sri KCR visit to Komuravelli Mallikarjuna Swamy temple https://t.co/IpZvtQbPmw
— Telangana CMO (@TelanganaCMO) February 23, 2022