హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు.
అదేవిధంగా మండలిలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు.
సీఎం కేసీఆర్ను సన్మానించిన స్పీకర్
రైతుల రుణాలు మాఫీ చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించారు. లక్ష మంది రైతులకు లబ్ధి చేకూర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.