‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం
సీఎం సభకు భారీ ఏర్పాట్లు
వనపర్తి, మార్చి 6 : ఈ నెల 8న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు, సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జడ్పీ పాఠశాల మన ఊరు-మనబడి కార్యక్రమ ప్రారంభానికి ముస్తాబవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా లోనే మొట్టమొదటి నూతన కలెక్టరేట్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఇక్కడే కర్నెతండా లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 40 ఎకరాల్లో సీఎం బహింగ సభ నిర్వహించనున్నారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.