21 శాఖల అధికారుల సమన్వయంతో వసతులు
18న మేడారానికి సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ములుగు, ఫిబ్రవరి 13 : తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. ముందుగా వనదేవతలను దర్శించుకొన్నారు. బస్టాండ్తోపాటు రెవెన్యూ గెస్ట్హౌస్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. 21 శాఖల అధికారుల సమన్వయంతో మహా జాతరను విజయవంతం చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 2లక్షల నుంచి 7లక్షల మంది భక్తులు వస్తున్నారని, జాతర ముఖ్యమైన నాలుగు రోజుల్లో కోటి మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా తల్లులను దర్శించుకోనున్నట్టు మంత్రి చెప్పారు.
జాతరకు 2.50 కోట్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రూ.2.50 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.