హైదరాబాద్/మియాపూర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు హైటెక్స్ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది.
హైటెక్స్కు చేరుకొనే దారి లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున భారీ జాతీయ జెండాలతో అలంకరిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ప్రాంగణం వరకు దాదాపు 750 మీటర్ల దారికి ఇరువైపులా ప్రత్యేకంగా 400 స్తంభాలను ఏర్పాటు చేశారు. హైటెక్స్ ప్రాంగణంలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, గ్రీనరీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జోనల్ కమిషనర్ శంకరయ్య ఆదేశించారు. దీంతో శేరిలింగంపల్లి, చందానగర్ డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్ శనివారం పలు విభాగాల అధికారులతో హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. కాగా, హైటెక్స్ లోపల ఏర్పాట్లను టీఎస్ఐఐసీ అధికారులు చేపడుతున్నారు.
ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
15న గోలొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం డీజీపీ మహేందర్రెడ్డితో కలసి సమీక్ష జరిపారు. తొలుత అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, శాంతి కుమారి, అరవింద్ కుమార్, సునీల్ శర్మ, అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు జయేశ్రంజన్, రవిగుప్తా, అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన
వజ్రోత్సవాల స్ఫూర్తిని విద్యార్థుల్లో నిం పేందుకు పాఠశాల విద్యాశాఖ ‘గాంధీ’ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నది. రిచర్డ్ ఆటెన్బరో రూపొందించిన ఈ చిత్రా న్ని ఈ నెల 9, 10, 11, 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 563 సిని మా హాళ్లలో ప్రదర్శించనున్నారు. ఆ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వెల్లడించారు.
ఎర్రకోటలో పరేడ్కు గిరిజన విద్యార్థులు
15న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో మరిపెడ, మణుగూరు, కొత్తగూడెంకు చెందిన త్రివేణి, నందకేశవ్, బీ నవీన్, బీ విష్ణు ఉన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు, బాల సదనాలు, స్టేట్ హోమ్స్, వృద్ధాశ్రమాలు, వసతి గృహాల్లో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరపాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు సూచనలు