మహబూబాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాల, కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం వారు పరిశీలించారు. బహిరంగ సభ కోసం బయ్యారం రోడ్డులోని రవాణా కార్యాలయం, సాలార్తండా వద్ద రెండు ప్రాంతాల్లో స్థల పరిశీలన జరిపారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. అదే రోజు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జిల్లాకేంద్రంలో రూ.62 కోట్లతో కలెక్టరేట్ సముదాయాన్ని, రూ.40 కోట్లతో వైద్య కళాశాల భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.