హైదరాబాద్ : తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రయివేటీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.
రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. దళిత బంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలి. ఈ పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ తెలిపారు.