సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తోనే టీ-హబ్ 2.0 సాధ్యమైందని టీ-హబ్ బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి కొనియాడారు. 8 ఏండ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. స్టార్టప్లకు ఊతమిచ్చే విధానాలను, ప్రణాళికలను అమలుచేశారని తెలిపారు.
స్టార్టప్లకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించారని చెప్పారు. టీ హబ్ అద్భుతమైన భవనం, అత్యాధునిక ఎకో సిస్టంతో రూపుదిద్దుకొన్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సంస్థ టీ-హబ్ 2.0 అని, నాలుగు వేలకు పైగా స్టార్టప్లు పనిచేసేందుకు దోహదపడుతుందని వివరించారు. స్టార్టప్లపై అందరికీ అవగాహన పెంపొందించేలా పాఠశాల స్థాయి నుంచే అకడమిక్లో సైతం సమాచారాన్ని చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
సాంకేతిక వికేంద్రీకరణ ఇప్పడు ఎన్నోరంగాల్లో ఉద్యోగాలను కల్పిస్తున్నదని చెప్పారు. యువత అందిపుచ్చుకోవడానికి టీ-హబ్ చక్కని వేదికగా ఉపయోగపడుతుందన్నారు. స్టార్టప్లు అంతర్జాతీయకరణం చెందుతున్నాయని, టెక్నాలజీపై ప్రజలు 2.5 ట్రిలియన్ డాలర్లు కేటాయిస్తున్నారని వివరించారు.