హైదరాబాద్ : అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ నేడు ఇంప్లిమెంట్ అవుతుందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన సీఎం.. ఇప్పటికీ దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
గుజరాత్లో దళిత బిడ్డలు పెళ్లికి గుర్రంపై ఊరేగిస్తేనే కొడుతున్నారు.. అది మార్చాలి అంటున్నా.. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం.. అది తప్పా. 77 శాతం సంపద.. 10 శాతం మంది దగ్గర ఉండటం కాదు. అది మారాలి అంటున్న అది తప్పా. అంతర్జాతీయ ట్రక్కు స్పీడ్.. 105 కిలోమీటర్లు.. మన దేశంలో ట్రక్కు స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేలు రావాలి.. ఇన్ఫ్రాస్ట్రక్షర్ రావాలి అంటున్నా తప్పా.. అందుకే రాజ్యాంగం మారాలి అంటున్న అది తప్పా.. అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మన దేశంలో గూడ్స్ రైలు యావరేజ్ స్పీడ్ 57 కిలోమీటర్లు.. అంతర్జాతీయ యావరేజ్ 115 కిలోమీటర్లు..మనకు కూడా అటువంటి గూడ్స్ ట్రెయిన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం రావాలంటున్నా తప్పా.. అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిలితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్పా.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో రావాల్సిన పరివర్తన ఎట్టిపరిస్థితుల్లోనూ అహింసాయుతంగా ఉండాలి. శాంతియుతంగా ఉండాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ప్రజాశక్తిని కూడదీయాలి.. అంబేడ్కర్ గారు చెప్పిన మార్గంలో బోధించు.. సమీకరించు.. పోరాడు.. మంచి పద్ధతిలో వారు చెప్పారు. మహాత్మాగాంధీ గారు అనేక సంవత్సరాలు అహింసా మార్గంలోనే పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ మిలిటరీ పద్ధతిలో పాల్గొన్నారు. నేను కూడా మహాత్మాగాంధీ శిష్యుడినే. ఆయన అవలంభిస్తున్న అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం రావాలి.. కానీ.. ఒకవేళ అహింసా మార్గం ద్వారా రాకపోతే.. నేను గన్తో రెడీగా ఉంటా.. గన్తో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా అని సుభాష్ చంద్రబోస్ చెప్పారు.. అని స్వాతంత్ర్య పోరాటాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.