CM KCR | అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు కనీసం సిగ్గుండదా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గులాబీ జెండా ఎగురవేసిన తర్వాత నీళ్ల కోసం జరిగిన తండ్లాటలో.. కోదాడ టూ హాలియా నేనే పాదయాత్ర చేశాను. నేను చేసిన రెండో పాదయాత్ర ఇదే. ఆ నాడు కోదాడ, బాలాజీనగర్ తండాలగుండా వెళ్తుంటే ఎక్కడ చూసినా మొరం కుప్పలు కనిపిస్తున్నయ్.
ఇదేమని అడిగితే రైతులందరూ దిక్కులేక క్రేన్లు బావులు తవ్వుతున్నారని చెప్పారు. వాటిని చూసుకుంటూ బాధపడుతూపోయాం. ఈ పీడ పోవాలంటే.. పసలేని.. పిసపిస మాట్లాడే కాంగ్రెస్ నాయకులతో కాదు.. ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే కావాలి. కర్ణుడికి ఎట్లయితే కవచ గుండలాలు ఉండెనో.. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం. తెలంగాణ ప్రజలకు అడుగడుగునా కపలాగా ఉండి హక్కులు కాపాడేందుకే పుట్టిందని మనవి చేస్తున్నా’నన్నారు.
‘నేను నల్లగొండకు వచ్చి 2001లో సభ పెట్టేదాక.. కండ్ల ముందు ఒక పచ్చి అన్యాయం జరుగుతుంది. కుడి కాలువ ఆంధ్రాకు పారుతుంది. ఎడమ కాలువ మనకు పారుతది. దాన్ని గోల్మాల్ చేసి వచ్చే నీళ్లు రాకుండా చేశారు. అక్కడక్కడ రైతులు లిఫ్ట్లు పెట్టుకుంటే.. కుడికాలువ కాలువ రైతులకు కరెంటు ఫ్రీ సరఫరా. గవర్నమెంట్ మేయింటేన్ చేస్తుండే. ఎడమ కాలువ రైతులకు మాత్రం పన్నులు రైతులు మీద వేశారు. నేను అడిగా.. ఒకే ప్రాజెక్టు మీద రెండు కాలువలు ఉంటే.. కుడి కాలువకో నీతి ? ఎడమ కాల్వో నీతి ఎంత వరకు సమంజసం ? ఇందుకే ఆంధ్రప్రదేశ్లో ఉండాల్నా అని అడిగితే.. ఆ నాడు మంత్రి వచ్చి మిర్యాలగూడ మీటింగ్ పెట్టి ఈకాడి నుంచి మేమే కరెంటు బిల్లులు కడుతాం.. మేమే ఉద్దరిస్తాం అని మాట్లాడారు’ అంటూ గుర్తు చేశారు.
‘నాగార్జున సాగర్ ఆయకట్టే కాదు మొన్న ఇక్కడికో పెద్ద మనిషి వచ్చిండు. భట్టి విక్రమార్క అని సీఎల్పీ నాయకుడు. ఆయన కూడా ఇక్కడ పాదయాత్ర చేశాడు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అబద్ధాలకు కనీసం సిగ్గుండదా? బాధ్యతగల పదవులు ఎలా మాట్లాడాలి ? నడిగుడ, మోతె, మునగాల మండలాల ప్రజలు ఉన్నారు కదా సభలో.. కోదాడలో పాదయాత్రకు పోతే కాళేశ్వరం నీళ్లు కనిపించలేదని భట్టి విక్రమార్క అన్నడు.
మరి ఇవాళ మునగాల, నడిగూడెం, మోతె మండలాల ప్రజలు నీరు వచ్చిందా? రాలేదా చెప్పాలి. ఈ మండలాలకు కాళేశ్వరం నీళ్లు వచ్చి పంటలు పండుతున్నయ్. మిగతా ప్రాంతాలకు నీరు రావాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు అనుసంధానం చేయించే బాధ్యత నాది. భవిష్యత్లో ఖమ్మం జిల్లా, నల్లగొండ జిల్లాలో పంటలు పండాలంటే పాసుపండ్ల కాంగ్రెస్తో కాదు. వాళ్లు ఎన్నడూ చేయలేదు. ఆలోచన చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ రాజ్యం ఉంటే.. కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చునా గోదావరి నీళ్లు. జన్మలో కూడా రాకపోవు. రేపు నల్లగొండ శాశ్వత విముక్తి కల్పించే పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలుస్తుంది. మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం గెలుస్తుంది.. పథకాన్ని తీసుకువస్తా’నని తెలిపారు.