CM KCR Press meet | పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మాట్లాడేవన్నీ అబద్ధాలే అని ఆధారాలతో సహా సీఎం కేసీఆర్ నిరూపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న అపోహలను ఆయన తెలంగాణ ప్రజానికానికి తెలియజేశారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 105.52 డాలర్లుగా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లుగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లను దాటలేదు. ఆయిల్ ధర క్రాష్ అయి చాలా సార్లు తగ్గాయి కానీ.. ఏనాడూ పెరగలేదు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి అని కేంద్రం అబద్ధం చెప్పి ధరలు పెంచుతూ పోయింది. పెంచే పద్ధతి కూడా అడ్డదిడ్డంగా ఉంది. దాంట్లో సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి ధరలు పెంచారు. రాష్ట్రాల వాట ఎగ్గొడుతూ.. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సెస్ కింద మార్చి లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు. 2014 లో 77 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే ఇప్పుడు రూ.114 చేశారు. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే రూ. 107.40 పైసలు చేశారు.. అని లెక్కలతో సహా సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు.
మొన్న జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. కొండంత పెంచి.. పిసరంత ధరలను తగ్గించి ఏదో గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటోంది కేంద్రం. అంతే కాదు.. రాష్ట్రాలు కూడా తగ్గించండి అని మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీని డిమాండ్ చేస్తున్నా. ముందు సెస్ విత్డ్రా చేసుకోండి. 2014 రేట్కే ఇప్పుడు పెట్రోల్ ఇవ్వొచ్చు.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయింది తప్పితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదు. ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలేదు. కేంద్రం పెంచింది కానీ.. రాష్ట్రం ఏనాడూ పెంచలేదు. ఏ నైతికతతో మీరు మాట్లాడుతున్నారు. మితిమీరి.. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. అంటూ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ