KCR | కౌటాల, జూన్ 3: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని, మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి గెలిచి ఉన్నత స్థానంలో ఉండాలని ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి 101 మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు బయలుదేరాడు. అందులో భాగంగా శుక్రవారం తిరుమలకు కాలినడకన చేరుకున్నాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన ధోని సాయిరాం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ పార్టీకి వీరాభిమాని. గతంలోనూ సాయిరాం ఇదే కోరిక మీద హిమాలయాలు ఎక్కి బీఆర్ఎస్ జెండా, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కోనప్ప చిత్రపటాలను ప్రదర్శించాడు. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనప్ప చిత్రపటాలతో తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి.. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, కోరిక నెరవేరితే వెయ్యిన్నొక్క దేవుళ్ల దర్శనం చేసుకుంటానని మొక్కినట్టు సాయిరాం తెలిపాడు.