ఎల్కతుర్తి, నవంబర్ 22: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిరుపేదల కోసం ప్రభుత్వ స్థలాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన 120 నూతన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
పోడు భూసమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీపై పోరాడే సత్తా వామపక్షాలకు ఉన్నదన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మే హక్కు బీజేపీ సర్కార్కు లేదన్నారు.