Telangana Secretariat | హైదరాబాద్ : నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా సచివాలయం నిర్మించామని పేర్కొన్నారు. వినూత్న రీతిలో అత్యద్భుతంగా సచివాలయం నిర్మించామన్నారు.
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడం అని పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సచివాలయం నిర్మించామని తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. తాత్వికత సైద్ధాంతిక అవగాహనతోనే అంబేద్కర్ పేరు పెట్టామని కేసీఆర్ తెలిపారు.