హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ, జకుల వెంకటయ్య, భగవంతు, వీ నాగిరెడ్డి, చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే, దేశ వ్యవసాయ సార్వభౌమత్వం పూర్తిగా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.