CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శోభకృత్ నామ ఉగాది పండుగ( Ugadi Festival ) శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి అని సీఎం ఆకాంక్షించారు.
తాగు, సాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ( Telangana ) లో నిత్య వసంతం నెలకొంది అని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది. శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు దేశం మరింత అభివృద్ధి సాధించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.