CM KCR | మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని సీఎం అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘మూడు సంవత్సరాలు కష్టపడి ధరణిని తీసుకువచ్చాం. బాధ్యత లేకుండా దాన్ని తీసివేస్తమంటున్నరు. మళ్లీ ఒగలభూమి ఒకరు గుంజుకోవాలి.. తాకులాటలు పెట్టెలా.. జుట్లు ముడేయాలి. మళ్లీ కోర్టులు, వకీళ్లు, ఆఫీసుల చుట్టూ తిరగాలే. మళ్లీ వీఆర్వోలు వస్తరు. అన్నా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నయ్. రైతుబంధు ఎంత వస్తది ? సంవత్సరానికి లక్ష వస్తదంటే నాకు రూ.40వేలు ఇవ్వాలంటాడు. ఇవాళ ఆ ఆఫీసుకు వెళ్లకుండా ధరణితో మీ అకౌంట్లో డబ్బులు వచ్చిపడుతున్నయ్. ఈ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తే మళ్లీ మొదటికిపోది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లయితది. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు’ అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఇంకోటి చెబుతున్నడు. మూడు గంటల కరెంటు సరిపోతుందట. మరి మూడుగంటల కరెంటు సరిపోతదా? 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ రావాలి. మూడు గంటలకే పొలం పారుతుంది.. 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలట? మరి టెన్ హెచ్పీ ఎవడు కొనివ్వాలే. మరి వీని అయ్యకొనిస్తడా? రైతుల దాకా టెన్ హెచ్పీ ఉంటదా? తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. ఏందీ ఈ మాటలు. పెద్ద ప్రమాదం ఉన్నది. మేం బాజాప్త చెప్పినం. అయినా మాకే ఓటు వేశారు.. తీసి అవతల పడేస్తమ్ అంటరు అప్పుడు నేను కూడా ఏం చేయలేను. అందుకే ఆలోచించాలి. 15 ఏళ్లు కాంగ్రెస్ తిప్పలు పెడితే చచ్చుడో బతుకుడో అని దీక్షపట్టి సావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ తీసుకువచ్చాను. తెచ్చిన తెలంగాణను పేదనుసాదను.. చిన్నాపెద్ద అందరినీ కలుపుకొని కుల, మతాలు లేకుండా మంచిగా తెలంగానను ఒక దరికి తెస్తున్నాం’ అన్నారు.
‘ఈ తెలంగాణ మళ్లీ నాశనం కావొద్దన్నదే నా బాధ. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తం.. మళ్లీ పట్వారీలను పెడుతాం.. మళ్లీ దళారీలు.. దోపిడీలు స్టార్ట్ చేస్తాం.. భూములు కబ్జాలు పెడతం.. ఇదేనా కావాల్సింది? బీఆర్ఎస్ కావాలో ఆలోచించాలి. ఈ విషయాలపై గ్రామాలకు వెళ్లిన తర్వాత జనాలను పోగేసి చర్చ పెట్టాలి. కరెంటు కావాల్నా ? కాంగ్రెస్ కావాల్నా?.. రైతుబంధు కావాల్నా ? రాబంధు కావాల్నా ? ఏది కావాలో నిర్ణయం చేయాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.